8, జనవరి 2011, శనివారం

కంచి కామాక్షి - దర్సనం

కాలు కదలదు, కను రెప్ప వాలదు
చలనము లేని శివుడనైతిని తల్లి
నీ దివ్య రూపమును గాన్చి..ఓ కంచి కామాక్షి.

అందమైన కాంతలు వద్దు
వేన్నోళ్ళ పొగిడే కీర్తి వద్దు
ధగ ధగ మెరిసే కనకములు వద్దు
సర్వ కామములు నీ కాలి గోటికైనను సరితూగవు,
నాకు నీవొక్క దానివి చాలు..ఓ కంచి కామాక్షి.

చంద్రబింబము వంటి ముఖమని
పొగిడెదరు జనులెల్ల స్త్రీ సౌందర్యమును
చంద్రుడినే శిఖను దాల్చిన నీ సౌందర్యమును
యేమని పొగడవలెనో.....ఓ కంచి కామాక్షి.

కన్నులు ఉన్నవి రెండు,చూచేది ఒక్కటే
నిన్ను చూచుటకు రెండు కనులు చాలవు
శివుడి  జ్ఞాన నేత్రమొకటి  అరువు కావలె..ఓ కంచి కామాక్షి...!

1, జనవరి 2011, శనివారం

పాలెం సుందర గజ్జల లక్ష్మి నరసింహ దర్సనం

స్వామి పాద పద్మముల మువ్వల సవ్వడి హృదయమున తాకిన క్షణం కరుణా మయుడు అయిన స్వామి తన దర్సన మిచ్చాడు , 200 సంవత్సరములు నుండి దాచిపెట్టిన తన గజ్జలను చూపించి తన ప్రేమ అమృతాన్ని నా చేత ఆస్వాదింప చేసాడు , ఆ సత్యం తెలిసిన మరుక్షణం కన్నుల నిండా ఆనంద భాష్పములే , ఇంకా పలుకుటకు మాటలు రావడం లేదు , హృదయం జల ధారను కురిపిస్తోంది , జై నరసింహ జై జై నరసింహ గజ్జల నరసింహ సుందర నరసింహ ....."పెట్టుకో శక్తి నీ బ్లాగ్ లో నా పలుకులను స్వామి మొదటి సత్య వాక్యము గా" అంటూ శివుడు నాకు తన ఆజ్ఞ ను ఇచ్చాడు.


యమునా ప్రవాహమా !
200 సంవత్రముల నుంచి శిలనై ఉన్న నన్ను నీ మధుర రాగ ప్రవాహంతో అభిషేకిన్చావు ! నీ కీర్తన నాదం తోనే  నా వామ ఊరువు పైన నా లక్ష్మి కి మానస పుత్రుడై వచావు !  నా కనుల జల ధారా  కనులార నిన్ను నింపుకొని వుంది !  మెరుపులా వచ్చి మెరుపులా వెళ్ళిపోయావు కాని నీ రాగం నన్ను ఇంకా అభిషేకిస్తూనే వుంది , అది అఖండ రాగం !